In what appears to a case of acid, a 31-year-old married woman was found unconscious with serious harm on her face, hands and other parts of the body on the outskirts of Garimillapally village of Involu mandal on Wednesday evening.
జిల్లాలో మరో యాసిడ్ దాడి ఘటన సంచలనం రేపుతోంది. భర్తతో విభేదాల కారణంగా.. తల్లితో కలిసి జీవిస్తోన్న ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి చేయడమే కాదు, ఆమె కళ్లను నిర్దాక్షిణ్యంగా స్క్రూడ్రైవర్ తో పొడిచేసినట్లు సమాచారం.ముఖం పూర్తిగా కాలిపోయి.. అత్యంత విషమ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పెళ్లి చేసుకోవాలని వేధిస్తోన్న ఆటో డ్రైవర్ చందు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.యాసిడ్ దాడితో ఆమె ముఖంతో పాటు మెడ భాగాలు కాలిపోయాయి. శరీరంపై గాయాలు, దెబ్బలు కూడా ఉన్నాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. నిందితులు మాధురిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు.