Random Video

సీ ప్లేన్ మీద చక్కర్లు : అక్కడ మోది ఇక్కడ చంద్రబాబు, సేమ్ స్టైల్ !

2017-12-14 755 Dailymotion

Chandrababu Naidu took a test flight of seaplane in Krishna river. This comes a day after, Prime Minister Narendra Modi travelled from Sabarmati River in Ahmedabad to Dharoi Dam. This test flight of the amphibian aircraft took off at Krishna River's Punnami Ghat in Vijayawada.

ఈ మధ్య ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. బుధవారం చంద్రబాబు సీ ప్లేన్ మీద చక్కర్లు కొట్టారు. అయితే ఇప్పుడు ఆ షికారే సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని మోడి గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీ ప్లేన్ లో విహరించి 24 గంటలన్నా కాలేదు. అంతలోనే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడలో అదే పని చేసి వార్తల్లో కెక్కారు. పైగా చంద్రబాబు కూడా సేమ్ టు సేమ్ మోడి సీ ప్లేన్ మీద ఏ స్టయిల్లో నిలబడ్డారో అచ్చంగా అదే మోడల్లో తాను కూడా ఫోటోలకు ఫోజులిచ్చేశారు. అయితే అందులో ఏముందంటారా? ఇదంతా యాధృచ్ఛికంగా జరిగుండొచ్చు అనుకుంటున్నారా? కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం అలా అనడం లేదు. దీని వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు.
అయితే ఇదంతా పక్కనపెడితే కృష్ణా నదిలో మరో నెల రోజుల్లో సీప్లేన్‌ అందుబాటులోకి రాబోతోంది. దానికి అవసరమైన ట్రయల్‌రన్‌ను చంద్రబాబునాయుడు బుధవారం పూర్తి చేశారు. నీటిలో, నేలపై తేలికగా దిగే ఈ విమానాల వల్ల ap పర్యాటక రంగం మరింత అబివృద్ది చెందుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు కేవలం విదేశాల్లో మాత్రమే చూసే ఇలాంటి విమానాలు మన దగ్గరకూ రావడం చాలా ఆనందంగా ఉందని పలువురు అబిప్రాయపడ్డారు.