Random Video

Praja Sankalpa Yatra: YS Jagan Interaction With Arya Vysya Community People

2018-02-05 2 Dailymotion

YS Jagan Interaction With Arya Vysya Community People in Nellore Distric

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 79వ రోజు ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని దేవరపాలెంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చెప్పాను. ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. కచ్చితంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ఆర్యవైశ్యులకు అండగా నిలబడతాం. ఆర్యవైశ్యులకు గొప్ప చారిత్రక, రాజకీయ నేపథ్యం ఉంది. ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చిన గాంధీజీ ఈ దేశానికే స్ఫూర్తిదాయకం అని వైఎస్‌ జగన్‌ అన్నారు