Random Video

ఆపరేషన్ గరుడ పై జేడీ లక్ష్మీనారాయణ వివరణ

2018-06-07 1,146 Dailymotion

CBI Former JD Lakshmi Narayana responded on Operation Garuda in South State

తాను ఏ పార్టీతోను టచ్‌లో లేనని, కేవలం ప్రజలతోనే టచ్‌లో ఉన్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బుధవారం వెల్లడించారు. ఆయన జనసేనలోకి వెళ్తారని గతంలో ప్రచారం జరిగింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఆరెస్సెస్ వేరు, పార్టీలు వేరు అని చెబుతున్నారు. ఇతర పార్టీలోకి వెళ్లే ప్రచారంపై స్వయంగా ఆయన స్పందించారు.
ఇటీవల నటుడు శివాజీ, టీడీపీ నేతలు ఆపరేషన్ గరుడ అని బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. దక్షిణాదిపై ఆపరేషన్ గరుడ ప్లాన్‌తో వచ్చారని చెబుతున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందించారు. తనకు ఆపరేషన్‌ గరుడ అంటే ఏమిటో తెలియదన్నారు. తనకు తెలిసిందల్లా అబ్దుల్ కలాం గారు చెప్పిన గరుడ గురించి మాత్రమే అన్నరు. ఆయన చెప్పినట్టు గరుడ పక్షిలాంటి దృక్పథం అలవరచుకోవాలని మాత్రమే తనకు తెలుసునని చెప్పారు.
సమస్యలు పరిష్కారమై ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పారు. తాను ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తానని చెప్పారు. ప్రజాధరణ కోసం తాను ఎప్పుడూ పని చేయనని, పాకులాడనని తెలిపారు. ప్రజాదరణ అనేది సైడ్ ఎఫెక్ట్ లాంటిది అన్నారు. తాను పాపులారిటీ కోసం పని చేస్తున్నానని చెప్పే వారి దృక్పథం అలాంటిదన్నారు. భయం నుంచి వారు అలా మాట్లాడుతున్నారన్నారు.