ఇంగ్లాండ్ గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ 'ఫినిషర్'పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విరుచుకుపడుతుండగా.. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ సైతం పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తాజాగా ఈ జాబితాలో భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేరాడు.