BRS leader Prashanth Reddy On Congress Govt : సచివాలయం ముందు రాజీవ్గాంధీ విగ్రహం పెట్టొద్దని చాలా మంది మేథావులు చెబుతున్నా, దిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్రెడ్డి సర్కార్ విగ్రహ ఏర్పాటుకు హడావుడిగా పూనుకుందని బీఆర్ఎస్ నేత ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారని, అందుకోసం స్థలం కూడా కేటాయించినట్లు వివరించారు. తెలంగాణ ఆత్మ లింక్ను తెగ్గొట్టిన ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.