Minister Nara Lokesh speech at VIT University : చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన సంస్కరణలు, ఐటీ అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్లే నేడు అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువారు కీలక పదవుల్లో ఉన్నారని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) అన్నారు. అమరావతిలోని విట్ యూనిర్శిటీలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ విద్యా ప్రదర్శనను లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు రూపొందించిన కొత్త ఆవిష్కరణలను తిలకించారు.