Random Video

ఏపీ రూ. 408 కోట్లను తెలంగాణకు చెల్లించేలా కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్​

2024-12-13 3 Dailymotion

CM Revanth Request To Central Ministers : రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి రూ. 18 వందల కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఉమ్మడి సంస్థల నిర్వహణ ఖర్చులను ఏపీ నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, పలు కొత్త మార్గాలను కేంద్రం నిధులతోనే చేపట్టాలని అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.