World Telugu Writers Sixth conference : తెలుగు వెలుగులీనింది.. అమ్మ భాష ప్రతిధ్వనించింది. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా"అమ్మభాషను కాపాడుకుందాం.. ఆత్మాభిమానం పెంచుకుందాం" అనే నినాదంతో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యయి. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి, గౌరవాన్ని తీసుకొచ్చారంటూ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను స్మరించుకున్నారు. తెలుగు భాష పరిరక్షణకు అంతా కలిసికట్టుగా నిలబడాలని వక్తలు పిలుపునిచ్చారు.