SRSP Canal Accident : వరంగల్లో సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సెలవురోజుల్లో సొంతూరిలో సరదాగా గడుపుదామునకున్న వారిని మృత్యువు కబళించింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి : వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటూ ఎల్ఐసీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. శని ఆదివారాలు సెలవులు రావడంతో సరదాగా గడుపుదామని సొంత ఊరుకి బయల్దేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్సారెస్పీ కాల్వ వద్దకు రాగానే కారు ఒక్క సారిగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ప్రవీణ్, ఆయన కుమార్తె ఛైత్రసాయి, కుమారుడు సాయివర్ధన్ జల సమాధి అయ్యారు. ప్రవీణ్ భార్య కృష్ణవేణి మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు.