Random Video

'రేషన్​ కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు

2025-03-28 2 Dailymotion

Minister Uttam Kumar reddy On Ration Cards : రేషన్​ కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని అన్నారు. హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్​ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుందని తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారని అన్నారు.