Minister Uttam Kumar reddy On Ration Cards : రేషన్ కార్డు లేకున్నా లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని అన్నారు. హుజూర్నగర్లో సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం ఆందనుందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్లో అమ్ముతున్నారని అన్నారు.