AICC Sent Meenakshi Natarajan to Look on Gachibowli Land : కంచ గచ్చిబౌలిలోని 400ఎకరాల భూముల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు విపక్ష నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ వేడిని రాజేశాయి. పనులు ఆపాలని సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పరిణామాల నడుమ పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది.