PM Modi Relaunch Amaravati Works Today: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నేతృత్వంలో రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి చెందుతుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పునఃప్రారంభ వేడుకకు నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలివెళ్లారు. గత ఐదేళ్ల పాలనలో కుంటుపడిన రాజధాని అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వ పాలనలో పరుగులు పెడతాయని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని పునఃప్రారంభ వేడుకకు వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుండటంతో అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది.
అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం: రాష్ట్రానికి నడిబొడ్డున, అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తూనే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్ని ఏకకాలంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. విద్యా సంస్థలు, పరిశ్రమల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది.
నేడు అమరావతి వచ్చే ప్రజానికానికి శుభవార్త - ఈ బైపాస్ ఎక్కితే చాలు దూసుకెళ్లవచ్చు
అమరావతి పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం - నేడు పనులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ