ఇండియన్ ఆర్మీ ఇటీవల 'ఆపరేషన్ సిందూర్'లో తొలిసారి స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తయారయ్యాయి. భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ , ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి. 2021లో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం 100 యూనిట్ల ఆర్డర్ పెట్టింది. వీటి పరిధి 100 కిలోమీటర్ల వరకూ ఉండి, 5 నుండి 10 కిలోల వార్హెడ్ను తీసుకెళ్లగలవు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా నడిచే ఈ డ్రోన్లు శబ్దం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో శత్రువులు గుర్తించలేని రీతిలో తక్కువ ఎత్తులో గగనతలంలో సంచరిస్తూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
#operationsindoor #indianarmy #indiavspakistan #pahalgamattack #jammukashmir #national #asianetnewstelugu #skydrones #drones
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️