Miss World Contestants In Yadagirigutta Temple : యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని 10 మందితో కూడిన మిస్ వరల్డ్ పోటీదారుల బృందం సందర్శించింది. మరో 25 మంది బృందం భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తోంది. ఆలయానికి చేరుకున్న సందరీమణులు ముందుగా అతిథి గృహానికి వెళ్లారు. అక్కడి నుంచి అఖండ దీప మండపానికి చేరుకొని దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.