Random Video

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృ

2025-05-23 0 Dailymotion

CM Revanth Reddy Speech : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటించారు. మెదక్‌ అంటే ఇందిరమ్మ, ఇందిరమ్మ అంటే మెదక్‌ అని, ఇక్కడి ప్రజలను కాంగ్రెస్‌ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. జిల్లాలోని పస్తాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. జహీరాబాద్‌ నిమ్జ్‌ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. గేట్‌ వే ఆఫ్‌ ఇండస్ట్రీస్‌గా జహీరాబాద్‌ నిలవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి అవసరం అయిన నిధులు మంజూరు చేస్తామని, నారాయణ్‌ఖేడ్‌ అభివృద్ధికి ప్రత్యేక సమీక్ష నిర్వహించి అవసరం అయిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.